భూ వరాహమూర్తి వృత్తాంతము .
పూర్వకాలమున సనకసనందనాదులు శ్రీహరిని దర్శించుటకై గుజ్జురూపములు ధరించి వైకుంఠమునకు పోయిరి .
ద్వారపాలకులుగాయున్న జయ విజయులు మునులను దర్శనమునకు పంపక అడ్డగించి వెనుకకు త్రోయగా మునీశ్వర్లు అవమానము భరించలేక మీరు “ రాక్షసులై " పోయెదరుగాక అని శపించరు .
జయ విజయులు మా తప్పులను క్షమించమని మునులను ప్రార్థించగా , వారు శాంతించి మా శాపమునకు తిరుగులేదు . కావున మూడు జన్మములలో శ్రీహరిని ఎదిరించి వారి చేతులలో మరణించి , తరువాత వైకుంఠమున యథావిధిగా ద్వారపాలకులై విష్ణుమూర్తిని సేవిం చెదరని చెప్పి వైకుంఠమునుండి మునీశ్వర్లు వెళ్ళిపోయిరి .
జయ విజయులు ఒకడు హిరణ్యాక్షుడు , రెండవ వాడు హిరణ్యకశ్యపుడు అను నామములతో భూ లోకమున రాక్షసులుగా జన్మించిరి .
హిరణ్యాక్షుడు పరమ దుర్మార్గుడు . ఋషులను , దేవతలను , విష్ణుభక్తులను హింసించుచుండెను. ఒకసారి భూ మండలమును చాపగా చుట్టి పాతాళమున దాచెను . దేవతలు హిరణ్యాక్షుని బాధలు భరించలేక విష్ణుమూర్తిని ప్రార్థించారు.
విష్ణుమూర్తి అభయమిచ్చి వారిని పంపివేసి తాను శ్వేతవరాహ అవతారము దాల్చి సముద్రగర్భమునుండి పాతాళము నకు పోయి తన వాడి కోరలతో హిరణ్యాక్షుని చంపి భూమిని పైకి తెచ్చెను .
ఋషులు , దేవతలు , గంధర్వులు వరాహస్వామిని ప్రార్థించి యీ భూమండలమును కాపాడినారు . కావున భూలోకములో నుండి భక్తులను కాపాడవలసినదిగా ప్రార్థించారు.
విష్ణుమూర్తి శేషాచలమలో నివాసము ఏర్పరచుకొని భక్తులను సంరక్షణ చేయుచు మునులతో యిష్టాగోష్టి జరుపుతు తనను దర్శింపవచ్చిన భక్తులను రక్షించుచుండెను .
వరాహ స్వామికి ఎంతోమంది భక్తులు ఏర్పడిరి . అందులో ముఖ్యురాలు వకుళాదేవి ఆమె స్వామికి భక్తితో పరిచర్యలు చేయుచుండెను .
వకుళా దేవి పూర్వజన్మ వృత్తాంతము .
ద్వాపర యుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారమును చాలించునని తెలిసి ద్వారళవాసులు అందరూ దుఃఖసాగరమున మునిగియుండు సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకొని కృష్ణునివద్ద వచ్చి" నాయనా : నీవు అవతారము చాలించున్నావు అని విన్నాను . నీముద్దు ముచ్చటలు అన్నీ చూశాను . కాని నీకు జరిగిన కళ్యాణము లను ఒక్కటి గూడ చూచుటకు నోచుకోలేదు . కావున నీ వివాహము , తనివితీరా చూచు భాగ్యము నాకు కల్పించు అని కోరెను .
అందులకు శ్రీకృష్ణుడు యశోదా దేవిని యూరడించి " మాతా ! నేను కలి యుగములో వేంకటనాయకుడై అవతారము దాల్చి నీ చేతుల పైగా వివాహము జరిపించుకొనెదను .
నీవు కలియుగములో వకుళమాతగా జన్మించి శ్రీ వరాహ స్వామిని పూజించుచుండగలవు . నేను అచ్చటికి వచ్చి నీతో కలసి కాలము గడుపు చుండును " యని వరము ఇచ్చెను . శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న యశోద మిక్కిలి సంతోషించెను . యశోదాదేవి జీర్ణమైన శరీరమును విడచి , కలియుగమున వకుళమాలికగా జన్మించి శేషాచలమున శ్రీ వరాహస్వామిని సేవించుచుండెను .
0 Comments